డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో ఎంపీ సుప్రియా సూలే భేటీ
ABN, First Publish Date - 2020-08-13T23:29:51+05:30
డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే గురువారం భేటీ అయ్యారు.
ముంబై : డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే గురువారం భేటీ అయ్యారు. తన లోకసభ నియోజకర్గ పరిధిలో ఉన్న సమస్యలపై చర్చించేందుకే వచ్చానని సుప్రియా సూలే ప్రకటించారు. ‘‘నా నియోజకవర్గ సమస్యలను చర్చించడానికే అన్నతో భేటీ అయ్యాను’’ అని ఆమె ప్రకటించారు.
సుప్రియా సూలే ఈ కారణం చెబుతున్నా.... వెనుక వేరే కారణం ఉన్నట్లు ఎన్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. నటుడు సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్పజెప్పాలంటూ అజిత్ పవార్ కుమారుడు పార్ధూ పవార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలు అపరిపక్వ వాఖ్యలని, వాటిని పట్టించుకోవద్దని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీ జరిగినట్లు సమాచారం.
Updated Date - 2020-08-13T23:29:51+05:30 IST