భారీ భద్రత మధ్య గ్యాంగ్స్టర్ కాన్పూరుకు తరలింపు
ABN, First Publish Date - 2020-07-10T13:00:45+05:30
ఉజ్జయిని నగరం నుంచి కరడుకట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాన్పూరుకు తీసుకువచ్చారు.....
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఉజ్జయిని నగరం నుంచి కరడుకట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాన్పూరు టోల్ ప్లాజా వరకు తీసుకువచ్చారు.13 కార్లలో సాయుధ పోలీసుల భద్రత మధ్య రోడ్డు మార్గంలో ఉజ్జయిని నుంచి దూబేను తీసుకొని గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం కాన్పూరుకు తీసుకువచ్చారు. 8 మంది పోలీసులను హతమార్చన వికాస్ దూబే పారిపోయిన నేపథ్యంలో ఆయనను భారీ భద్రత మధ్య కాన్పూరుకు తీసుకువచ్చారు. వికాస్ దూబేను శుక్రవారం ఉదయం 10 గంటలకు కాన్పూర్ కోర్టులో హాజరు పర్చాలని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. 60 కేసుల్లో నిందితుడైన దూబేను కోర్టులో హాజరు పర్చి అతన్ని విచారించేందుకు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
Updated Date - 2020-07-10T13:00:45+05:30 IST