యూపీలో ఆగని కరోనా ఉధృతి.. గడచిన 24 గంటల్లో పరిస్థితి ఇదీ...
ABN, First Publish Date - 2020-07-05T00:37:13+05:30
ఉత్తర ప్రదేశ్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గడచిన 24 గంటల్లో ఇక్కడ మరో ..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడచిన 24 గంటల్లో ఇక్కడ 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 773కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 757 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,554కి పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 18,154 మంది కోలుకున్నారనీ.. ప్రస్తుతం 7,627 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని యూపీ ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 68.36 శాతంగా ఉన్నట్టు తెలిపారు.
Updated Date - 2020-07-05T00:37:13+05:30 IST