శోయబ్తో పాటు ఆకాంక్షనూ నెం.1గా ప్రకటించాలి: యోగి
ABN, First Publish Date - 2020-10-29T02:22:27+05:30
రాష్ట్రంలోని కుషినగర్ జిల్లాకు చెందిన విద్యార్థి ఆకాంక్ష కుటుంబ సభ్యలతో కలిసి ముఖ్యమంత్రి యోగిని ఆకాంక్ష కుటుంబ సభ్యులు తాజాగా కలుసుకున్నారు. అనంతరం యోగి ఆమెను అభినందించారు
లఖ్నవూ: నీట్లో వంద శాతం మార్కులు సంపాదించిన ఆకాంక్ష సింగ్ను కూడా మొదటి ర్యాంకర్గానే పరిగణించాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2020 నీట్ పరీక్షలో శోయబ్ అనే విద్యార్థితో పాటు ఆకాంక్ష కూడా నూరు శాతం మార్కులు సంపాదించింది. అయితే నీట్ నిబంధనల నిత్యా శోయబ్ను మొదటి ర్యాంకర్గా ఆకాంక్షను రెండవ ర్యాంకర్గా ప్రకటించారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం లేసింది. ఇద్దరు ఒకే రకమైన మార్కులు సాధించినప్పుడు రెండు ర్యాంకులు ప్రకటించడమేంటని నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపధ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలోని కుషినగర్ జిల్లాకు చెందిన విద్యార్థి ఆకాంక్ష కుటుంబ సభ్యలతో కలిసి ముఖ్యమంత్రి యోగిని ఆకాంక్ష కుటుంబ సభ్యులు తాజాగా కలుసుకున్నారు. అనంతరం యోగి ఆమెను అభినందించారు. దేశంలోని బాలికలకు, యువతులకు ఆకాంక్షని కొనియాడారు. ఇక ఆకాంక్ష పై చదువలకు అయ్యే ఖర్చులు (విద్య, వసతి) ప్రభుత్వం భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Updated Date - 2020-10-29T02:22:27+05:30 IST