కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు కరోనా... వైరస్ బారిన నాలుగో కేంద్ర మంత్రి!
ABN, First Publish Date - 2020-08-09T10:48:24+05:30
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(60) కరోనా బారినపడ్డారు. దీంతో మంత్రిని ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చేర్చారు. కరోనా సోకిన కేంద్ర మంత్రుల జాబితాలో...
న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(60) కరోనా బారినపడ్డారు. దీంతో మంత్రిని ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చేర్చారు. కరోనా సోకిన కేంద్ర మంత్రుల జాబితాలో అర్జున్ రామ్ మేఘ్వాల్ నాలుగవ వ్యక్తి. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కైలాష్ చౌదరి కరోనా పాజిటివ్గా తేలారు. వైద్య విభాగానికి చెందిన డాక్టర్ నీరజ్ నిశ్చల్ పర్యవేక్షణలో అర్జున్ రామ్ మేఘ్వాల్ చికిత్స పొందుతున్నారు. మేఘ్వాల్కు తేలికపాటి కరోనా ఇన్ఫెక్షన్ ఉందని సమాచారం. అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్థాన్లోని బికనేర్ లోక్సభ స్థానానికి చెందిన ఎంపీ.
Updated Date - 2020-08-09T10:48:24+05:30 IST