యూఎన్ వాతావరణ సదస్సులో పాల్గొన్న 75 దేశాలు
ABN, First Publish Date - 2020-12-15T23:48:18+05:30
యూఎన్ వాతావరణ సదస్సులో పాల్గొన్న 75 దేశాలు
న్యూఢిల్లీ: యూఎన్ వాతావరణ ఆశయ సదస్సులో 75 దేశాలు పాల్గొన్నాయి. చిలీ, ఇటలీ దేశాల భాగస్వామ్యంతో డిసెంబర్ 12వ తేదీన పారిస్ వాతావరణ ఒప్పందం ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకుని వాతావరణ ఆశయ సదస్సు 2020ను యునైటెడ్ నేషన్స్, యూకే, ఫ్రాన్స్ దేశాలు నిర్వహించాయి.
ప్రభుత్వాలు, పౌర సమాజం, ప్రైవేట్ రంగం మరింత ఆశాజనకంగా మరియు వృద్ధి చెందిన వాతావరణ నిబద్ధతలను పునరుద్ఘాటించాయి. గ్లోబల్ వార్మింగ్ను 1.5డిగ్రీల సెంటిగ్రేడ్కు పరిమితం చేయగలమనే వాగ్ధానం ప్రదర్శించే అవకాశమూ కలిగింది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ పారిస్ వాతావరణ ఒప్పంద లక్ష్యాలను తాము ఏ విధంగా చేరుకుంటున్నది వెల్లడించారు. దేశంలో ఉద్గార స్ధాయిలు 21 శాతానికి తగ్గించామన్నారు.
దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ తాము 2018లోనే తాము 2040 నాటికి కార్బన్ నెగిటివ్ నిబద్ధతను చాటామని వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యంత సమర్థవంతమైన సిమెంట్ కంపెనీలలో ఒకటిగా నిలువడమే కాదు, అతి తక్కువ కార్బన్ ఫుట్ప్రింట్స్ విడుదల చేసిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
Updated Date - 2020-12-15T23:48:18+05:30 IST