ఉక్రెయిన్ మిలటరీ విమానం కూలి 25 మంది దుర్మరణం
ABN, First Publish Date - 2020-09-26T11:17:48+05:30
ఉక్రెయిన్ దేశంలో మిలటరీ విమానం శుక్రవారం అర్దరాత్రి కుప్పకూలిన దుర్ఘటనలో 25 మంది మరణించారు....
కేవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలో మిలటరీ విమానం శుక్రవారం అర్దరాత్రి కుప్పకూలిన దుర్ఘటనలో 25 మంది మరణించారు. ఉక్రెయిన్ దేశంలోని ఖర్కివ్ ప్రాంతంలో మిలటరీ విమానం ఆకాశంలో వెళుతుండగా ఇంజన్ ఫెయిలవ్వడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించారని ప్రాథమిక సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు.
మిలటరీ విమాన ప్రమాదం జరిగినపుడు విమానంలో 28 మంది ఉన్నారని, వారిలో 21 మంది కేడెట్లని, మరో ఏడుగురు విమాన క్రూ అని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.ఈ విమాన ప్రమాదంలో 30 ఏళ్ల ఎయిర్ క్రాఫ్ట్ కమాండర్ మరణించారు.
Updated Date - 2020-09-26T11:17:48+05:30 IST