క్వారంటైన్ కేంద్రం కిటికీ పగలగొట్టి ఇద్దరు జమాత్ కార్యకర్తల పరారీ
ABN, First Publish Date - 2020-04-04T12:22:24+05:30
కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది....
కాశీపూర్ (ఉత్తరాఖండ్): కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కరోనా వైరస్ విస్తరించకుండా ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇద్దరు జమాత్ కార్యకర్తలను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్లో ఉండాల్సిన ఇద్దరు కార్యకర్తలు ఆసుపత్రి కిటికీని పగలగొట్టి పారిపోయారు. పారిపోయిన జమాత్ కార్యకర్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు.14 రోజులపాటటు క్వారంటైన్ లో ఉండాల్సిన వారు పారిపోవడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2020-04-04T12:22:24+05:30 IST