ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-08-14T14:49:48+05:30

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ ప్రాంతంలో శుక్రవారం భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండీ (హిమాచల్ ప్రదేశ్): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ ప్రాంతంలో శుక్రవారం  భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. మండీలోని హనోజీ దేవాలయం సమీపంలో మూడు వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. కుల్లూ మార్గంలో నిత్యావసరాలు, కూరగాయలు తీసుకువెళుతుండగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హనోజీ దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. దేవాలయం సమీపంలో వాహనాలు నిలిపిఉంచగా కొండచరియలు విరిగి పడి ప్రమాదం జరిగిందని మండీ జిల్లా ఎస్పీ చాంద్ శర్మ చెప్పారు. వరదల వల్ల పాగల్ నాలా పొంగి ప్రవహించడంతో కుల్లూ జిల్లాలో రాష్ట్ర రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  

Updated Date - 2020-08-14T14:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising