ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ జన్మదినోత్సవం సందర్భంగా బీజేపీ సేవా సప్తాహం

ABN, First Publish Date - 2020-09-17T12:55:27+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా ఈ నెల 14వతేదీ నుంచి 20 వతేదీ వరకు వారం రోజులపాటు సేవా సప్తాహం నిర్వహించాలని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా ఈ నెల 14వతేదీ నుంచి 20 వతేదీ వరకు వారం రోజులపాటు సేవా సప్తాహం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గురువారం మోదీ జన్మదినోత్సవంలో భాగంగా వారం రోజుల పాటు మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంతోపాటు దేశంలోని ప్రతీ జిల్లాలోనూ 70 ప్రాంతాల్లో 70 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరుపేదలకు రేషన్ అందించారు. రక్తదాన శిబిరాలు, కంటి చెకప్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. 


న్యూఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో పాక్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధులకు కుట్టుమిషన్లు, ఈ రిక్షాలు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. మోదీ జన్మదిన వేడుకల్లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్,ఎంపీ మనోజ్ తివారీలు పాల్గొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ లో మోదీ 70వ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు 70 కిలోల లడ్డూను శివాలయంలో పంపిణీ చేశారు. హిందూ సేన మోదీ జన్మదినోత్సవాన్ని ఢిల్లీలోని శివశక్తిమందిరంలో నిర్వహించింది. 

Updated Date - 2020-09-17T12:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising