ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగల దుకాణంలో భారీ చోరీ.. గోడకు కన్నం పెట్టి..

ABN, First Publish Date - 2020-09-26T16:51:23+05:30

రియలూరులో నగల దుకాణంలో ప్రవేశించిన ఆగంత కులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. తిరుప్పూర్‌కు చెందిన సౌందర్‌రాజన్‌ అరియలూరు చిన్నకడై వీధిలో నగల దుకాణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : అరియలూరులో నగల దుకాణంలో ప్రవేశించిన ఆగంత కులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. తిరుప్పూర్‌కు చెందిన సౌందర్‌రాజన్‌ అరియలూరు చిన్నకడై వీధిలో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి యధావిధిగా దుకాణం మూసేసి వెళ్లిన సౌందర్‌రాజన్‌ శుక్రవారం ఉదయం దుకాణం తెరవగా వస్తులన్నీ చిందరవందరగా పడివుండడం చూసి దిగ్ర్భాంతి చెందాడు. దుకాణం వెనుక భాగంలో గ్రిల్స్‌ తొలగించి ఉండడాన్ని గమనించాడు. దుకాణం వెనుక వైపున్న టెంకాయల దుకాణం నుంచి గోడకు కన్నం వేసి లోనికి ప్రవేశించిన వ్యక్తులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. అక్కడే ఉన్న బీరువాను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బీరువాలో ఉన్న రూ.1.50 లక్షల నగదు, బంగారు, వెండి నగలు చోరీ కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారించారు. ఆగంతకుల ఆచూకీ కోసం వచ్చిన పోలీసు జాగిలం దుకాణం నుంచి కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. అదే సమయంలో సమీపంలోని దుకాణాల వద్ద ఏర్పాటుచేసిన సీసీఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-26T16:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising