పది మంది ఇండోనేషియన్లు, ఇమామ్పై కేసు
ABN, First Publish Date - 2020-04-09T08:13:48+05:30
టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం చేయడమే కాకుండా కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న అభియోగాలపై పది మంది ఇండోనేషియా దేశస్థులు, పెద్దపల్లి జిల్లా రామగుండం మసీదు ఇమామ్పై...
- టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం
- కరోనా వ్యాప్తికి కారణంపై అభియోగాలు
కోల్సిటీ, ఏప్రిల్ 8: టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం చేయడమే కాకుండా కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న అభియోగాలపై పది మంది ఇండోనేషియా దేశస్థులు, పెద్దపల్లి జిల్లా రామగుండం మసీదు ఇమామ్పై రామగుండం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గత నెల 14న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసిన ఇండోనేషియా దేశస్థులు రామగుండంలో దిగి ముసలియా మసీదులో ప్రార్థనలు చేశారు. వారికి అక్కడి ఇమామ్ సహకరించాడు.
Updated Date - 2020-04-09T08:13:48+05:30 IST