ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లోని చురులో చురుక్కుమంటున్న ఎండలు

ABN, First Publish Date - 2020-05-24T21:38:37+05:30

రాజస్థాన్‌లోని చురులో ఈ ఆదివారం భానుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢి్ల్లీ : రాజస్థాన్‌లోని చురులో ఈ ఆదివారం భానుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపించబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో నవతాప దినాల్లో ఈ ఆదివారం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చునని తెలిపింది. చురులో చలికాలంలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత నమోదవుతుంది, వేసవి కాలంలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.


దేశవ్యాప్త అష్ట దిగ్బంధనంలో సడలింపులు ఇచ్చినప్పటికీ ఎప్పుడూ రద్దీగా ఉండే ధర్మస్థూపం ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. ప్రజలు మండుటెండలకు తాళలేక ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మధ్యాహ్నం వేళ వడగాలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు వీథుల్లోకి రావడానికి ఇష్టపడలేదు. 


బికనీర్‌లో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు టోపీలు, చేతులకు తొడుగులు ధరించారు. 


రాజస్థాన్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండవచ్చునని తెలిపింది. 


Updated Date - 2020-05-24T21:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising