ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిహార్‌లో 'మహా జంగిల్ రాజ్' : తేజస్వి

ABN, First Publish Date - 2020-11-29T20:32:17+05:30

హార్‌లో శాంతి భద్రతల పరిస్థితి 'మహా జంగిల్ రాజ్'ను తలపిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బిహార్‌లో శాంతి భద్రతల పరిస్థితి 'మహా జంగిల్ రాజ్'ను తలపిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. జేడీయూ ఎమ్మెల్యే సహచరుడిని గోపాల్‌గంజ్ ఏరియాలో కాల్చిచంపిన ఘటనను ఆయన ఖండించారు. బిహార్‌లో 'మహా జంగిల్ రాజ్' నడుస్తోందని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. 'నేరగాళ్ల స్వైరవిహారం, కాల్పులు, వాణిజ్యవేత్తలను బెదరించడం వంటి వాటితో రాష్ట్రంలో మహాజంగిల్ రాజ్ నడుస్తోంది. ప్రతిచోటా భయాందోళనలు, గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాంతిభద్రతలు మృగ్యమయ్యాయి. ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ ట్రైన్‌ మీద నిస్సహాయంగా కూర్చున్నారు. మహాజంగిల్ రాజ్ మహారాజు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు?' అని తేజస్వి హిందీలో ట్వీట్ చేశారు.


శనివారంనాడు గోపాల్‌గంజ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు జరపడంతో జేడీయూ ఎమ్మెల్యే అమరేంద్ర పాండే సన్నిహితుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరపు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-29T20:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising