ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నితీష్‌‌‌ టార్గెట్‌గా తేజ్ ప్రతాప్ యాగం

ABN, First Publish Date - 2020-04-27T01:02:53+05:30

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నాలో ఆదివారంనాడు యాగం నిర్వహించారు. 'సద్బుద్ధి మహాయాగం' పేరుతో ఈ యాగాన్ని తేజ్ ప్రతాప్ జరిపించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికులను తిరిగి బీహార్‌కు రప్పించే విషయంలో నితీష్‌కు సద్బుద్ధి ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్టు తేజ్ ప్రతాప్ తెలిపారు.


'వలస కార్మికులను వెనక్కి రప్పించే విషయంలో నితీష్ స్వార్థంగా, మతిస్థిమితం తప్పిన వాడిలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి స్వార్థపు ఆలోచనల నుంచి ఆయన బయట పడాలి. బీహార్ భాగ్యవిధాతలైన ప్రజలను, పేద కూలీలను వెనక్కి రప్పించాలనే సద్బుద్ధి ఆయనకు భగవంతుడు ప్రసాదించాలి' అని తేజ్ ప్రతాప్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక్క బీహార్ మినహా అన్ని రాష్ట్రాల వారు తమ విద్యార్థులను, వలస కూలీలను వెనక్కి తెచ్చుకుంటున్నాయని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు. తేజ్ ప్రతాప్ నిర్వహించిన యాగంలో ఆయనతో పాటు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2020-04-27T01:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising