ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిప్పంటించుకొని దంపతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-08-13T15:05:51+05:30

నిప్పంటించుకొని దంపతుల ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కుటుంబ సమస్యలతో ఓ దంపతులు నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఈ సంఘటనలో వారి కుమా రుడు, కుమార్తెకు కూడా గాయాల య్యాయి. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీప అల్లిగుండాం గ్రామానికి చెందిన జయరామ్‌ (38), కని (33) దంపతులకు కవిన్‌(15) అనే  కుమారుడు, దర్శిని (13) అనే కుమార్తె ఉన్నారు. జయరామ్‌ తన లారీలో పొరుగు రాష్ట్రాలకు లోడు తీసుకొని వెళ్తుంటాడు. ఇటీవల పొరుగు రాష్ట్రానికి వెళ్లిన సమయంలో లారీ మరమ్మతులకు గురైంది. దీంతో మరమ్మతుల కోసం డబ్బులు తీసుకొని వెళ్లేందుకు లారీ ఆ ప్రాంతంలోనే వదిలిన జయరామ్‌ ఇంటికి వచ్చాడు. మంగళవారం స్నేహితులతో కలసి మద్యం తాగి ఇంటికొచ్చిన భర్తతో కని వాగ్వాదానికి దిగింది. దీంతో ఆగ్రహించిన జయరామ్‌ భార్యపై కిరోసిన్‌ పోయ డంతో పాటు తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. బాధను భరించలేక వారి పెట్టిన కేకలతో బయటకొచ్చిన కవిన్‌, దర్శిని.. వారిని రక్షించబోగా వారికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని మంటలను ఆర్పి ఆ నలుగురిని ఉసిలంపట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కని మృతి చెందింది. ఇదిలా ఉంటే ప్రాథమిక చికిత్స అనంతరం జయరామ్‌ను మదురై ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై సేటపట్టి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-08-13T15:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising