భయం వద్దు..ఇలా చేయండి: హిజ్రాలు
ABN, First Publish Date - 2020-07-11T22:30:25+05:30
భయం వద్దు..ఇలా చేయండి: హిజ్రాలు
చెన్నై: తమిళనాడులో శనివారం కరోనాపై హిజ్రాలు అవగాహన కల్పించారు. కరోనాపై భయాన్ని దూరంగా ఉంచాలంటూ చెన్నైలోని తోండియార్పేట, నేతాజీ నగర్ మార్కెట్ ప్రాంతాల్లో చెన్నై కార్పొరేషన్ వాలంటీర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్పై అవగాహన కల్పించే ఫ్లకార్డులను ప్రదర్శించారు. కరోనాపై భయాందోళన చెందవద్దని హిజ్రాలు చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఈ మహమ్మారిని తరిమికొట్టాలని హిజ్రాలు నినాదాలు చేశారు.
Updated Date - 2020-07-11T22:30:25+05:30 IST