ఆఫ్ఘన్ భద్రతా దళాలపై తాలిబన్ల దాడి... 7గురు సామాన్యుల హత్య...
ABN, First Publish Date - 2020-04-08T23:46:29+05:30
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులు దారుణంగా ప్రవర్తించారు. అపహరించుకుపోయిన ఏడుగురు
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులు దారుణంగా ప్రవర్తించారు. అపహరించుకుపోయిన ఏడుగురు సామాన్య పౌరులను హత్య చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ఉత్తరాదిలో ఉన్న బల్ఖ్ ప్రావిన్స్ షోల్గారా జిల్లా పోలీసు అధికారులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం తాలిబన్ ఉగ్రవాదులు భద్రతా దళాలపై దాడి చేశారు. మంగళవారం వీరు అపహరించిన ఏడుగురు సాధారణ పౌరులను హత్య చేశారు.
ఈ దాడికి తమదే బాధ్యత అని తాలిబన్లు ప్రకటించలేదు.
Updated Date - 2020-04-08T23:46:29+05:30 IST