తబ్లిగ్ జమాత్ సభ్యులు మానవ బాంబుల్లా తిరిగారు..హిమాచల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-04-05T12:36:08+05:30
తబ్లిగ్ జమాత్ సభ్యులపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ సంచలన వ్యాఖ్యలు.....
సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): తబ్లిగ్ జమాత్ సభ్యులపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు తబ్లిగ్ జమాత్ సభ్యులు మానవబాంబుల్లా దేశంలో తిరిగారని రాజీవ్ బిందాల్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశంలో కరోనా వైరస్ కట్టడికి పోరాడుతున్నాయని బిందాల్ చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనా కట్టడికి సహకారం అందిస్తున్నారని, కాని కొందరు మానవ వ్యతిరేక శక్తులు కరోనా తీవ్రతను గుర్తించడం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో మొత్తం 3వేల కరోనా కేసులు బయటపడగా, వాటిలో నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగ్ జమాత్ సభ్యులే 1,023 మంది ఉన్నాయని, జమాత్ సమావేశమే కరోనాకు ప్రధాన హాట్ స్పాట్గా మారిందని బీజేపీ నాయకుడు రాజీవ్ బిందాల్ చెప్పారు.
Updated Date - 2020-04-05T12:36:08+05:30 IST