ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వస్తువులను బహిష్కరించండి : స్వదేశీ జాగరణ్ మంచ్

ABN, First Publish Date - 2020-04-25T22:01:02+05:30

చైనా ఆధారిత వస్తువులను వాడటం నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. ఆదివారం నుంచి దీనిని ఓ ఉద్యమంగా నిర్వహిస్తామని ఆ సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్ : చైనా ఆధారిత వస్తువులను వాడటం నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. ఆదివారం నుంచి దీనిని ఓ ఉద్యమంగా నిర్వహిస్తామని  ఆ సంస్థ ప్రకటించింది. చైనా వస్తువులను బహిష్కరించాలన్నది ఈ సంస్థ మూల సూత్రాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో చైనాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరోసారి స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ఏప్రిల్ 25 ను అందరూ ‘స్వదేశీ సంకల్ప్ దివస్’గా జరుపుకోవాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది.


‘‘ఏప్రిల్ 25 న తమ తమ ఇళ్లలో సాయంత్రం 6:30 నుంచి 6:40 వరకూ దీపాలు వెలిగించి, చైనా వస్తువులను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేయాలి’’ అని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహజన్ తెలిపారు. లాక్‌డౌన్, ఆర్థిక నష్టం, ఉద్యోగాలు ఊడిపోవడం ఇవన్నీ కూడా చైనా సృష్టించిన కరోనా వైరస్ వల్లేనని, చైనా వైరస్‌తో దేశ ఆర్థిక రంగంతో పాటు ప్రపంచ ఆర్థిక రంగం కూడా బాగా కుదేలైందని అశ్వనీ మహజన్ మండిపడ్డారు. 

Updated Date - 2020-04-25T22:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising