ఆసుపత్రి నుంచి కరోనా వైరస్ అనుమానిత బాధితుడి అదృశ్యం
ABN, First Publish Date - 2020-03-16T12:39:16+05:30
కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండగా, మరోవైపు కరోనా లక్షణాలతో ఉన్న రోగులు ఆసుపత్రుల నుంచి పారిపోతున్న ఘటనలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి.....
దర్బంగా (బీహార్): కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండగా, మరోవైపు కరోనా లక్షణాలతో ఉన్న రోగులు ఆసుపత్రుల నుంచి పారిపోతున్న ఘటనలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ లక్షణాలున్న ఓ రోగి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోయిన ఘటన బీహార్ రాష్ట్రంలోని దర్బంగా వైద్యకళాశాల ఆసుపత్రిలో వెలుగుచూసింది. దర్బంగా నగరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలుండటంతో అతన్ని దర్బంగా వైద్యకళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ గదికి పంపించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్ గదిలో ఉన్న కరోనా వైరస్ లక్షణాలున్న రోగి పారిపోయాడు. దీంతో తాము జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని దర్బంగా వైద్యకళాశాల ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రాజీవ్ రంజన్ చెప్పారు. పారిపోయిన రోగి కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు.
Updated Date - 2020-03-16T12:39:16+05:30 IST