ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్భయ కేసులో విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన జడ్జి

ABN, First Publish Date - 2020-02-14T21:39:46+05:30

నిర్భయ కేసులో దోషుల ఉరిపై తీర్పును చదువుతూ సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఆర్. భానుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరిపై తీర్పును చదువుతూ సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఆర్. భానుమతి కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన కోర్టు హాలులో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను జస్టిస్ భానుమతి ధర్మాసనం విచారిస్తోంది. పటిషన్ విచారణ సందర్భంగా ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆమెకు ప్రాథమిక వైద్యం అందించారు. కొద్దిసేపటికి ఆమె తేరుకుని స్పృహలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు. అయితే తీర్పు మాత్రం త్వరగా వెల్లడిస్తామన్నారు. 


ఘటనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. జస్టిస్ భానుమతి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అయినా కోర్టుకు వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారన్నారు. 

Updated Date - 2020-02-14T21:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising