సన్ టీవీ నెట్వర్క్ 10 కోట్ల విరాళం
ABN, First Publish Date - 2020-04-10T07:22:33+05:30
కరోనాపై పోరాటానికి సన్ టీవీ నెట్వర్క్ గురువారం రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది. సన్ టీవీతో..
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 9: కరోనాపై పోరాటానికి సన్ టీవీ నెట్వర్క్ గురువారం రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది. సన్ టీవీతో పాటు దాని అనుబంధ సంస్థల ఉద్యోగులు మొత్తం ఆరు వేల మంది కలిసి తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. పీఎం కేర్స్ ఫండ్కు జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎ్సఎల్) రూ.5 కోట్ల విరాళం ప్రకటి ంచింది. పీఎం కేర్స్కు విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.10 లక్షల విరాళం అందజేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సంస్థ ప్రతినిధులు చెక్కుతో పాటు గ్లోవ్స్, మాస్కులు కూడా అందజేశారని పేర్కొన్నాయి.
Updated Date - 2020-04-10T07:22:33+05:30 IST