ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వైరస్ నుంచి కోలుకున్న మహిళ ఏం చెప్పిందంటే...

ABN, First Publish Date - 2020-03-30T13:10:33+05:30

‘‘అందరూ ఇళ్లలోనే ఉండండి, జనం రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు’’ అని కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఓ మహిళ సూచించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ‘‘అందరూ ఇళ్లలోనే ఉండండి, జనం రద్దీ ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు’’ అని కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఓ మహిళ సూచించారు. ముంబై నగరంలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో పనిమనిషిగా పనిచేసిన అంజనాబాయికి (65) మార్చి 17వతేదీన కరోనా వైరస్ సోకడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉండి కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అంజనాబాయి తన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.


పనిచేసే ఇంటి యజమాని అమెరికా నుంచి తిరిగి రావడంతో అతని వల్ల తనకు కరోనా సంక్రమించిందని అంజనాబాయి చెప్పారు. కరోనా వచ్చినా ప్రజలు భయపడకుండా ధైర్యంగా ఉంటే అదే నయమవుతుందని అంజనాబాయి పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు, వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లో ఉండండి, రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని ఆమె సూచించారు.   ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకు చికిత్సచేశారని, దానివల్లనే తాను కోలుకున్నానని చెప్పారు. ‘‘మీరు ప్రభుత్వ నియమాలను పాటిస్తే, కరోనావైరస్ దగ్గరకు రాదు’’ అని అంజనాబాయి స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T13:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising