రాష్ట్రాలు రైతుల ఆత్మహత్యల వివరాలు ఇవ్వట్లేదు
ABN, First Publish Date - 2020-09-22T08:20:50+05:30
పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీలు) రైతుల ఆత్మహత్యల వివరాలను ఇవ్వడం లేదని కేంద్రం సోమవారం స్పష్టం చేసింది. అందువలన వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలపై...
- కేంద్ర హోం శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీలు) రైతుల ఆత్మహత్యల వివరాలను ఇవ్వడం లేదని కేంద్రం సోమవారం స్పష్టం చేసింది. అందువలన వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలపై జాతీయ సమాచారం సిద్ధం చేయడానికి వీలు కావట్లేదని పేర్కొంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ మేరకు రాజ్యసభలో పేర్కొన్నారు. ‘‘జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) సమాచారం ప్రకారం.. పలు రాష్ట్రాలు, యూటీలు ఇతర వృత్తుల్లో ఆత్మహత్య నివేదికలు ఇస్తున్నాయి తప్ప, రైతు ఆత్మహత్యలపై మాత్రం ఒక్కటీ ఇవ్వలేదు. అందువల్ల రైతుల బలవన్మరణాలపై జాతీయ సమగ్ర సమాచారం తయారుచేయడం వీలుకాక, విడిగా ప్రచురించడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - 2020-09-22T08:20:50+05:30 IST