ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరద్ పవార్ చేసింది సరైనదే : శివసేన సమర్థన

ABN, First Publish Date - 2020-12-13T19:56:54+05:30

శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించాలంటూ అన్ని రాష్ట్రాలనూ కోరడాన్ని శివసేన సమర్థించుకొంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించాలంటూ అన్ని రాష్ట్రాలనూ కోరడాన్ని శివసేన సమర్థించుకొంది. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనే, శరద్ పవార్ రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చారని సామ్నాలో పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ‘చీకటి చట్టాలు’ అని శివసేన మండిపడింది. ఆ చట్టాలతో వ్యవసాయ భూములు కాస్త మరు భూములుగా మారతాయని, కొత్త చట్టాల ద్వారా రైతుల మరణాలు సంభవిస్తాయని అన్నారు. ‘‘రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పదేళ్ల క్రితం పవార్ సంస్కరణలను చేపట్టారు. అప్పటికి అదానీ, అంబానీ లేరు. గత ఆరేళ్లలోనే అంబానీ, అదానీ వ్యవసాయ మార్కెట్లలోకి వచ్చారు.’’ అని సామ్నా వేదికగా శివసేన చురకలంటించింది. రైతుల నిరసన రైతుల మానసిక స్థితిని ప్రతింబింబించడం లేదని కేంద్రం అర్థంపర్థం లేని వాదనలు చేస్తోందని, భారత్ బంద్ దానికి విరుద్ధమైన సంకేతాలిచ్చిందని శివసేన పేర్కొంది. 

Updated Date - 2020-12-13T19:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising