ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న రైతుల పొట్టకొడుతున్నారు.. వ్యవసాయ బిల్లులపై కపిల్ సిబల్ ధ్వజం..

ABN, First Publish Date - 2020-09-21T22:06:08+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర వ్యతిరేకత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీటి వల్ల లక్షలాది మంది నిరుపేద రైతులు నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీవ్ర ఆందోళన, నిరసనల మధ్య నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో సిబల్ స్పందిస్తూ.. ‘‘వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పడ్డాయి. కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేశారు. దీని వల్ల నిజంగా లాభపడేది ఆదానీ, అంబానీలూ.. కేంద్ర ప్రభుత్వమే. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఉపసంహరించుకుంటుంది కాబట్టి ఎఫ్‌సీఐ కూడా లాభపడుతుంది. ఇక ఎటొచ్చీ నష్టపోయేది లక్షలాది మంది నిరుపేద రైతులే.. ’’ అని ట్వీట్ చేశారు. కనీసం బేరమాడే సామర్థ్యం లేకపోవడం వల్ల పేద రైతులు దారుణంగా నష్టపోతారని కపిల్ సిబల్ పేర్కొన్నారు.



Updated Date - 2020-09-21T22:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising