26ఏళ్ల నాటి తప్పిదం.. మూల్యం చెల్లించిన కేరళ
ABN, First Publish Date - 2020-08-12T07:53:32+05:30
కేరళ ప్రభుత్వం 26ఏళ్ల క్రితం చేసిన తప్పిదానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త. గూఢచర్యం చేస్తున్నారంటూ శాస్త్రవేత్తగా...
- ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.1.30కోట్ల పరిహారం
తిరువనంతపురం, ఆగస్టు 11: కేరళ ప్రభుత్వం 26ఏళ్ల క్రితం చేసిన తప్పిదానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త. గూఢచర్యం చేస్తున్నారంటూ శాస్త్రవేత్తగా పని చేస్తున్న సమయంలో ఆయనను ప్రభుత్వం 1994లో అరెస్టు చేసింది. భారత అంతరిక్ష కార్యకలాపాలకు చెందిన రహస్య పత్రాల సమాచారాన్ని విదేశీయులకు అందజేశారని ఆరోపణలు మోపింది. దీంతో, ఆయన రెండు నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఆయనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ తేల్చింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసు బనాయించారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును నంబియార్ ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో నంబియార్కు కేరళ ప్రభుత్వం రూ.1.30కోట్లను నష్టపరిహారంగా అందజేసింది.
Updated Date - 2020-08-12T07:53:32+05:30 IST