ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుద్వారాపై ఉగ్రదాడి బాధ కలిగించింది: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-03-25T23:19:45+05:30

ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దాడిలో మృతి చెందిన వారి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలతో ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘కాబూల్ గురుద్వారాపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా బాధించింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని ప్రధాని పేర్కొన్నారు. కాబూల్‌లోని ఓ గురుద్వారాపై ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా దాడి అనంతరం జరిగిన కాల్పుల్లో ఆప్ఘాన్ భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 

Updated Date - 2020-03-25T23:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising