ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరికపై సచిన్ పైలెట్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-07-13T15:45:47+05:30

కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని సోమవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో తీవ్రంగా విభేదించి.. బీజేపీ చేరిపోతున్నారని వార్తలొచ్చాయి.


ఈ వార్తకు బలాన్నిచ్చే విధంగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కూడా భేటీ అయ్యారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ ఆయన సీఎం గెహ్లాట్ సర్కార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో మకాం వేసిన విషయం తెలిసిందే. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని సంచలన విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-13T15:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising