పాయల్ వర్సెస్ అనురాగ్: రూపాగంగూలీ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-09-21T21:33:58+05:30
బాలీవుడ్పై బీజేపీ ఎంపీ, నటి రూపా గంగూలీ సంచలన ఆరోపణలు చేశారు. ముంబై చిత్ర పరిశ్రమ ప్రజలను...
న్యూఢిల్లీ: బాలీవుడ్పై బీజేపీ ఎంపీ, నటి రూపా గంగూలీ సంచలన ఆరోపణలు చేశారు. ముంబై చిత్ర పరిశ్రమ ప్రజలను ‘‘డ్రగ్స్కు బానిసలుగా చేసి’’ వారిని ‘‘చంపేస్తోందంటూ’’ ఆమె విరుచుకుపడ్డారు. బాలీవుడ్పై ముంబై పోలీసులు తీవ్ర ‘‘అలసత్వం’’ ప్రదర్శిస్తున్నారంటూ దుయ్యబట్టారు. బాలీవుడ్లో లైంగిక వేధింపులను నిరసిస్తూ రూప ఇవాళ పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ‘‘ముంబై చిత్ర పరిశ్రమ ప్రజలను చంపేస్తోంది. డ్రగ్స్కి బానిసలుగా చేస్తోంది. మహిళలను దారుణంగా అవమానిస్తోంది. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా... కనీసం నోరు విప్పడం లేదు..’’ అని ఆమె ఆరోపించారు.
ప్రముఖ నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై బాలీవుడ్ ప్రముఖులు మౌనం వహించడంపైనా రూప మండిపడ్డారు. ‘‘అనురాగ్ కశ్యప్పై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై బాలీవుడ్ ఎందుకు మాట్లాడడం లేదు? అనురాగ్ కశ్యప్పై ముంబై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’’ అని రూపా గంగూలీ ప్రశ్నించారు. కాగా అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదనీ.. చట్టప్రకారం ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అనురాగ్ కశ్యప్ చెబుతున్నారు.
Updated Date - 2020-09-21T21:33:58+05:30 IST