కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా
ABN, First Publish Date - 2020-09-26T22:59:08+05:30
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా
సిమ్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోహ్రూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లాల్ బ్రక్తాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుగురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫేస్బుక్ బుక్ ద్వారా తన ఆరోగ్య స్థితిని కాంగ్రెస్ ఎమ్మెల్యే మిత్రులతో పంచుకున్నారు. గత 12 రోజులుగా తాను రోహ్రూలో ఏ బహిరంగ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని ఎమ్మెల్యే బ్రాక్తా తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
Updated Date - 2020-09-26T22:59:08+05:30 IST