రియా వెళ్లిపోయిన రోజు ఏం జరిగిందంటే..: హౌస్ కీపర్
ABN, First Publish Date - 2020-08-23T05:27:00+05:30
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఇవాళ మరో విషయం వెలుగులోకి వచ్చింది...
ముంబై: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఇవాళ మరో విషయం వెలుగులోకి వచ్చింది. రియా చక్రవర్తి జూన్ 8న సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు ఏం జరిగిందన్న దానిపై హౌస్ కీపర్ నీరజ్ సింగ్ నుంచి పోలీసులు ఇవాళ వాంగ్మూలం తీసుకున్నారు. నీరజ్ చెప్పిన దాని ప్రకారం.. ఆ రోజు రియా కోపంగా అతడి వద్దకు వచ్చి తన బ్యాగ్ సర్దాలంటూ చెప్పింది. ‘‘ఆ రోజు రాత్రి రియా భోజనం కూడా చేయకుండా వెళ్లిపోయారు. అప్పుడు ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. ఇక అప్పటి నుంచి ఆ రోజంతా సుశాంత్ తన గదిలోనే కూర్చుండిపోయారు...’’ అని హౌస్ కీపర్ వెల్లడించాడు. జూన్ 14న బంద్రాలోని తన నివాసంలో సుశాంత్ విగత జీవిగా కనిపించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2020-08-23T05:27:00+05:30 IST