మిగిలిన లాక్డౌన్ రోజుల్లో భగవద్గీత చదువుకోండి: సీఎం సూచన
ABN, First Publish Date - 2020-03-30T03:06:10+05:30
దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.
న్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. 21 రోజులపాటు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి విధించిన లాక్డౌన్ను అమలు చేయాలని ప్రజలను కేజ్రీ కోరారు. కావాలంటే లాక్డౌన్ పూర్తయ్యే వరకూ భగవద్గీత పఠిస్తూ కాలం వెళ్లదీయాలని సూచించారు. ‘లాక్డౌన్లో మిగిలిన రోజుల్లో చక్కగా ఇళ్లలోనే ఉండి భగవద్గీత పారాయణం చేయండి. నా భార్య కూడా నిన్నటి నుంచి ఇంట్లో ఇదే పని చేస్తోంది’ అని ఆయన తెలిపారు.
Updated Date - 2020-03-30T03:06:10+05:30 IST