పైనాపిల్ బాంబుతో ఏనుగును చంపడంపై రతన్ టాటా సంచలన ట్వీట్...
ABN, First Publish Date - 2020-06-04T18:09:02+05:30
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామిక ..
న్యూఢిల్లీ: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మలప్పురంలో జరిగిన ఈ ఘోరంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో రతన్ టాటా ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి...’’ అని టాటా తన పోస్టులో డిమాండ్ చేశారు.
Updated Date - 2020-06-04T18:09:02+05:30 IST