ఉత్తరాఖండ్లో అరుదైన ఎర్రరంగు పాము
ABN, First Publish Date - 2020-10-26T16:05:09+05:30
ఎర్ర రంగు అరుదైన పామును ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యూఎస్ నగర్ జిల్లాలోని ఓ ఇంట్లో అటవీశాఖ అధికారులు కనుగొన్నారు....
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఎర్ర రంగు అరుదైన పామును ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యూఎస్ నగర్ జిల్లాలోని ఓ ఇంట్లో అటవీశాఖ అధికారులు కనుగొన్నారు.యూఎస్ నగర్ లోని దినేష్పూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అరుదైన ఎర్రరంగు పామును అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. దినేష్ పూర్ ప్రాంత జగదీష్ పూర్ ప్రాంతంలోని త్రిలోకి ఇంట్లో ఉన్న పామును స్వాధీనం చేసుకొని దాన్ని అటవీప్రాంతంలో వదిలివేశారు. నైనిటాల్ ప్రాంతంలో సెప్టెంబరు 5, ఆగస్టు 7న రెండు ఎర్రరంగు పాములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర పగడపు కుక్రీ పాము వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం రక్షించాలి. విషం లేని ఈ పాము రాత్రిపూట వానపాములు, కీటకాలు, లార్వాలను తింటోంది.
Updated Date - 2020-10-26T16:05:09+05:30 IST