రాజస్థాన్ లో పెరిగిన కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-05-10T03:50:18+05:30
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రాజస్థాన్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు కొత్తగా 129 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ కరోనాతో ముగ్గురు మృతి చెందగా.. కోవిడ్-19తో మొత్తం 106 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 3,708 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
Updated Date - 2020-05-10T03:50:18+05:30 IST