ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయంత్రం 5 గంటలకు సీఎం గెహ్లోత్, పైలట్ ముఖాముఖి

ABN, First Publish Date - 2020-08-13T21:50:01+05:30

సీఎం అశోక్ గెహ్లోత్ నివాసంలో గురువారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : సీఎం అశోక్ గెహ్లోత్ నివాసంలో గురువారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి యువనేత సచిన్ పైలట్ కూడా హాజరుకానున్నారు. సచిన్ పైలట్ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కథ సుఖాంతం అయిన తర్వాత జరుగుతున్న మొదటి సీఎల్పీ సమావేశం ఇది. ఈ సమావేశం వేదికపైనే సీఎం గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ ఒకరినొకరు కలుసుకోనున్నారు.


శుక్రవారం కీలకమైన అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ సీఎల్పీకి ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, లాక్‌డౌన్ పరిణామాలను చర్చిస్తాం. దీనికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఇది ఉపయోగపడుతుంది’’ అని సీఎం గెహ్లోత్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-13T21:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising