ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రిలో ముస్లిం గర్భిణిపై నిర్ల్యక్షం... శిశువు మృతి

ABN, First Publish Date - 2020-04-05T11:12:33+05:30

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో గల ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. ముస్లిం వర్గానికి చెందిన గర్భిణిని చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆసుపత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భరత్‌పూర్‌: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో గల  ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. ముస్లిం వర్గానికి చెందిన గర్భిణిని చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారనే  ఆరోపణలు వినవస్తున్నాయి. ఆసుపత్రి నుండి వెనుతిరిగిన ఆ మహిళ  అంబులెన్స్ లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే  కొద్దిసేపటికే ఆ నవజాత శిశువు మరణించింది. విషయం తెలుసుకున్న భరత్‌పూర్ జిల్లా యంత్రాంగం ఈ ఉదంతంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ మహిళను ప్రస్తుతం భరత్‌పూర్‌లోని జానానా ఆసుపత్రిలో చేర్చారు. జానానా హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రూపేంద్ర మాట్లాడుతూ ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండడటంతో, ఆమెను  జైపూర్‌కు పంపించామన్నారు.  ఈ ఉదంతంపై రాజస్థాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ మాట్లాడుతూ భరత్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను  ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, సంబంధిత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2020-04-05T11:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising