నెత్తురు చిమ్మిన ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంట్లోని ఐదుగురి హత్య
ABN, First Publish Date - 2020-07-12T16:54:18+05:30
ప్రేమపెళ్లిపై నెత్తురు చిమ్మింది! తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరఫువారు దాడికి పాల్పడి అతడి ఇంట్లోని ఐదుగురిని దారుణంగా...
అమ్మాయి తరఫు వారి అమానుష దాడి
పరారీలో కొత్త జంట.. కర్ణాటకలో ఘోరం
రాయచూరు, జూలై 11: ప్రేమపెళ్లిపై నెత్తురు చిమ్మింది! తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరఫువారు దాడికి పాల్పడి అతడి ఇంట్లోని ఐదుగురిని దారుణంగా హత్యచేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిందీ ఘోరం. ఐదు నెలల క్రితం సింధనూరులోని మౌనేశ్ (31), మంజుల (31) ప్రేమ వివాహం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం యువకుడి ఇంటిపైకి యువతి తరఫు వారు దాడికి రావడంతో కొత్త దంపతులు పారిపోయారు. యువకుడి అన్న నాగరాజ (38), తల్లి సుమిత్ర (55), వదిన శ్రీదేవి (30), అన్న హనుమేశ్(40)లపై దాడిచేయడంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
Updated Date - 2020-07-12T16:54:18+05:30 IST