భారత్ ఎదుర్కొంటున్న అది పెద్ద సవాలు ఇదే: రఘురామ్ రాజన్
ABN, First Publish Date - 2020-04-06T02:47:30+05:30
లాక్ తరువాత ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలనే దానిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు.
న్యూఢిల్లీ: లాక్ తరువాత ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలనే దానిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. స్వాతంత్ర్యానంతరం భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అని వ్యాఖ్యానించారు. జీవిక కోల్పోయిన ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను తిరస్కరిస్తారని ఆయన హెచ్చరించారు. కరోనా మహమ్మారి కట్టడికి భారత్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆయన తాజాగా తన బ్లాగ్లో చర్చించారు. కరోనా మహమ్మారి పూర్తిగా కట్టడికాని పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆయన సూచించారు. ‘మహమ్మారి పూర్తిగా కంట్రోల్లోని రాని పరిస్థితిల్లో లాక్ డౌన్ తీసేయాల్సిన పరిస్థితి వస్తే అందుకు మనం సిద్ధపడాలి. ఎక్కువ కాలం ప్రజలను లాక్ డౌన్లో ఉంచలేం. జీవికకు ప్రమాదంలో పడితే వారు తిరగబడే ప్రమాదం ఉంది. అందుకానీ ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించాడినికి తీసుకోవాల్సి చర్యలపై ముందుగానే ఆలోచించాలి’ అని అన్నారు. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై పారిశ్రామిక వర్గాలతో కలసి చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - 2020-04-06T02:47:30+05:30 IST