ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లిగి కార్యకర్తలకు 24 గంటల డెడ్‌లైన్

ABN, First Publish Date - 2020-04-08T00:46:09+05:30

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లివచ్చి రహస్యంగా ఉంటున్న తబ్లిగి జమాత్ కార్యకర్తలకు పంజాబ్ ఆరోగ్య శాఖ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లివచ్చి రహస్యంగా ఉంటున్న తబ్లిగి జమాత్ కార్యకర్తలకు పంజాబ్ ఆరోగ్య శాఖ 24 గంటల డెడ్‌లైన్ విధించింది. రేపటిలోగా వారంతా పోలీసుల ముందుకు వచ్చి రిపోర్టు చేయాలనీ... లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజాముద్దీన్ వెళ్లివచ్చిన తబ్లిగి కార్యకర్తలంతా 24 గంటల్లోగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  మొత్తం 467 మంది తబ్లిగి జమాత్ కార్యకర్తలు నిజాముద్దీన్ నుంచి పంజాబ్ రాగా... అందులో 445 మందిని పోలీసులు గుర్తించారు. కాగా మరో 22 మంది ఎక్కడున్నారో ఇంకా తెలియరాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


కాగా పోలీసులు గుర్తించిన వారిలో 350 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. 111 మందికి కోవిడ్-19 నెగిటివ్ రాగా.. మిగతా 227 మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-04-08T00:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising