ప్రైవేటు రైళ్ల టిక్కెట్టు ధరలను నియంత్రించం.. స్పష్టం చేసిన కేంద్రం
ABN, First Publish Date - 2020-08-14T05:23:16+05:30
త్వరలో భారత్లో ప్రవేశపెట్టబోయే 151 ప్రైవేటు రైళ్ల టిక్కెట్ ధరలను నియంత్రించబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: త్వరలో భారత్లో ప్రవేశపెట్టబోయే 151 ప్రైవేటు రైళ్ల టిక్కెట్ ధరలను నియంత్రించబోమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆ రైళ్లను నడిపే సంస్థలే ధరను నిర్ణయిస్తాయని తెలిపింది. అయితే కంపెనీల మధ్య పోటీవాతావరణం కారణంగా ధరలు పెరిగే అవకాశం తక్కువేనని రైల్వే మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కార్యకలాపాల నిర్వహణలో ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. 2023 నుంచి దేశంలో ప్రైవేటు రైళ్లను ప్రవేశ పెట్టేందుకు భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మొత్తం 109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రవైటు సంస్థలు 35 ఏళ్ల పాటు ఈ సేవలను నిర్వహించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించి. ఈ ప్రదిపాదన పట్ల దేశీయ సంస్థలే కాకుండా.. అంతర్జాతీయ సంస్థలైన బొంబార్డియే, సీమెస్స్ కూడా ఆసక్తి కనబరిచాయి.
Updated Date - 2020-08-14T05:23:16+05:30 IST