13 గంటలు ఆస్పత్రి కోసం తిరిగి.. అంబులెన్సులో గర్భిణీ మృతి!
ABN, First Publish Date - 2020-06-07T04:49:36+05:30
ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఓ మహిళకు చికిత్స చేయడానికి నిరాకరించడంతో.. అంబులెన్సులోనే ఆమె కన్నుమూసింది.
లక్నో: ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఓ మహిళకు చికిత్స చేయడానికి నిరాకరించడంతో.. అంబులెన్సులోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. నీలం(30) అనే మహిళకు ప్రెగ్నెన్సీ సంబంధిత కాంప్లికేషన్స్ ఎదురయ్యాయని, ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి చాలా హాస్పిటల్స్ నిరాకరించాయని ఆమె భర్త విజేందర్ సింగ్ చెప్పాడు. తాము ఎనిమిది ఆస్పత్రులకు వెళ్లామని, వారెవరూ చికిత్స చేయలేదని మృతురాలి భర్త చెప్పాడు. బెడ్స్ ఖాళీ లేవని ఆ ఆస్పత్రులు చెప్పాయన్నాడు. చివరకు గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రి ఎదురుగా అంబులెన్సులోనే నీలం తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ బుద్ధ నగర్ మెజిస్ట్రేట్ సుహాస్ ఎల్వై.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Updated Date - 2020-06-07T04:49:36+05:30 IST