కరోనాపై గెలిచిన పోలీస్.. పూలవర్షం కురిపించిన స్థానికులు
ABN, First Publish Date - 2020-05-24T00:53:08+05:30
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ సమయంలో కూడా ప్రజాశ్రేయస్సు కోసం పోలీసులు పోరాడుతున్నారు.
ముంబై: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ సమయంలో కూడా ప్రజాశ్రేయస్సు కోసం పోలీసులు పోరాడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూస్తూ.. అవసరమైన వారికి చేయూతనిస్తూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన పోలీసు అధికారి కిరణ్ పవార్కు కరోనా సోకింది. దాంతో పోరాడి చిట్టచివరకు గెలిచిన కిరణ్.. శనివారం ముంబైలో తన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి చుట్టుపక్కల వారంతా చప్పట్లు కొడుతూ, కిరణ్పై పూలవర్షం కురిపించి తమ ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్యతో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా సేవలందిస్తున్న కిరణ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారందరికీ నమస్కరించి ధన్యవాదాలు తెలిపి ఇంట్లోకి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1600మంది పోలీసు అధికారులు కరోనా బారినపడ్డారు.
Updated Date - 2020-05-24T00:53:08+05:30 IST