ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుడ్ డెలివరీ కి ప్రభుత్వం ఓకే.. నో అంటున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-03-25T04:42:43+05:30

రెస్టారెంట్లపై దాడులు చేసి కిచెన్లు మూయించేస్తున్నారని ఫుడ్ స్టార్టప్ ఇన్నర్ చెఫ్ సంస్థ ఆరోపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చాపకింద నీరులా దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొన్ని వ్యవస్థల విషయంలో నిబంధనలను కొంత సడలించారు. లాక్ డౌన్ వేళల్లో ప్రజలకు రెస్టారెంట్లు అందుబాటులో ఉండవని ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఫుడ్ డెలివరీలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా పేర్కొన్నాయి. కానీ పోలీసులు ఈ ఆదేశాలను పట్టించుకోవడంలేదని, తమ రెస్టారెంట్లపై దాడులు చేసి కిచెన్లు మూయించేస్తున్నారని ఫుడ్ స్టార్టప్ ఇన్నర్ చెఫ్ సంస్థ ఆరోపిస్తోంది. ఈ అనుభవాలు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా తదితర ప్రాంతాల్లో తమకు ఎదురయ్యాయని ఇన్నర్ చెఫ్ సీఈవో రాజేష్ సాహ్ని తెలిపారు. దీంతో భయపడిపోయిన వంటివాళ్ళు తమ తమ గ్రామాలకు పారిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇలాగే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా  రాష్ట్రంలో పలుచోట్ల మీడియా ప్రతినిధులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-03-25T04:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising