రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ
ABN, First Publish Date - 2020-08-08T23:43:55+05:30
స్వచ్ఛభారత్ మిషన్పై ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ కేంద్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ..
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్పై ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ కేంద్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. మహాత్మాగాంధీ చేపట్టిన చంపారాన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ స్వచ్ఛతా కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్కేలో 'స్వచ్ఛ భారత్ మిషన్'పై రూపొందించిన లఘ విడియోను ప్రధాని తిలకించారు. మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజ్ఘాట్ వద్ద ఈ స్వచ్ఛ భారత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్పై భవిష్యత్ తరానికి దార్శనిక కేంద్రంగా ఆర్ఎస్కే నిలుస్తుందని పీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది.
Updated Date - 2020-08-08T23:43:55+05:30 IST