ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్ సమావేశాలను కుదించనున్న కేంద్రం!

ABN, First Publish Date - 2020-09-19T18:21:42+05:30

పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారినపడ్డ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారినపడ్డ ఎంపీల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికి దాదాపు 30 మంది ఎంపీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సమావేశాలను కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.


సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని కేంద్రం తలపోసింది. అయితే కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ‘కుదింపు’ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


‘‘పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో ఉంది కేంద్రం’’ అని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను ప్రారంభించినా... కేసులు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు సమాచారం. 

Updated Date - 2020-09-19T18:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising