పాకిస్థాన్లో 1500కు పెరిగిన కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-03-29T13:47:32+05:30
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్థాన్ దేశంలోనూ ప్రబలుతోంది.....
ఇస్లామాబాద్ (పాకిస్థాన్): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్థాన్ దేశంలోనూ ప్రబలుతోంది. పాకిస్థాన్ దేశంలో ఫిబ్రవరి 26వతేదీన మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడింది. ఆదివారం ఉదయం నాటికి పాకిస్థాన్ దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1500కు పెరిగింది. ఈ వైరస్ కారణంగా పాక్లో ఇప్పటికే 12 మంది మరణించారు. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. పాక్ సింధ్ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య 469 గా నమోదైంది. పాక్ లో కరోనా వైరస్ రోగుల సంఖ్య ఏరోజుకారోజు పెరుగుతుండటంతో ఆ దేశ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
Updated Date - 2020-03-29T13:47:32+05:30 IST