10 వేల మందికిపైగా ‘మహా’ పోలీసులకు కరోనా!
ABN, First Publish Date - 2020-08-06T00:13:31+05:30
మహారాష్ట్రలో ఇప్పటివరకూ 10 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని, 107 మంది కరోనాకు బలయ్యారని బుధవారం నాడు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలో ఇప్పటివరకూ 10 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని, 107 మంది కరోనాకు బలయ్యారని బుధవారం నాడు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ శాఖలోని మొత్తం కరోనా బాధితుల్లో 50 శాతం మంది ముంబై పోలీసులేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం 1859 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని, మరో 8,060 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని తెలిపారు. ఇక కరోనా కాలంలో నిబంధనలు అమలు చేసే క్రమంలో పోలీసులు పలు దాడులు ఎదుర్కొన్నారని, ఇటువంటవి మొత్తం 324 ఘటనలు జరగ్గా.. 86 మంది పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కరోనా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకూ 2.2 లక్షల పైచిలుకు కేసులు నమోదు చేశామని తెలిపారు.
Updated Date - 2020-08-06T00:13:31+05:30 IST